Nupur Sharma దిష్టిబొమ్మకు ఉరి.. కర్ణాటకలో ఘటన..
ABN , First Publish Date - 2022-06-11T01:12:23+05:30 IST
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ(Nupur Sharma) వివాదాస్పద వ్యాఖ్యల దుమారం కొనసాగుతూనే ఉంది. ఆమె
బెలగావి : మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ(Nupur Sharma) వివాదాస్పద వ్యాఖ్యల దుమారం కొనసాగుతూనే ఉంది. ఆమె వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఇటు భారత్తోపాటు అటు ముస్లిం దేశాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని బెలగావిలో నుపుర్ శర్మ దిష్టిబొమ్మ(Effigy)ను ఉరితీసినట్టుగా కొందరు దుండగులు వేలాడదీశారు. దిష్టిబొమ్మకు చీర చుట్టి, నుపుర్ శర్మ ఫొటోలను అతికించి వీధిలోని వైర్లకు వేలాడదీశారు. మతపరంగా అత్యంత సున్నితమైన ఫోర్డ్ రోడ్లో బషిబాన్ దర్గాకు సమీపంలో ఈ ఘటన జరిగిందని దక్కన్ హెరాల్డ్ రిపోర్ట్ పేర్కొంది. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే విషయం పోలీసుల దృష్టికి రావడంతో వెంటనే దిష్టిబొమ్మను తొలగించారని రిపోర్ట్ వెల్లడించింది. కాగా కొద్ది రోజుల క్రితం బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ముస్లిం దేశాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.