ఈత రాక పశువుల కాపరి మృతి

ABN , First Publish Date - 2021-03-03T04:57:44+05:30 IST

మండలంలోని కాగితాలపూరు పంచాయతీ పరిధిలోని గంగచెరువులో మంగళవారం ఈత రాక ఇరగరాజు పోలయ్య (45)అనే పశువుల కాపరి మృతి చెందాడు.

ఈత రాక పశువుల కాపరి మృతి
భర్త మృతదేహం వద్ద విలపిస్తున్న భార్య పద్మమ్మ

మనుబోలు, మార్చి 2: మండలంలోని కాగితాలపూరు పంచాయతీ పరిధిలోని గంగచెరువులో మంగళవారం ఈత రాక ఇరగరాజు పోలయ్య (45)అనే పశువుల కాపరి మృతి చెందాడు. కొండూరుసత్రం గిరిజన కాలనీకి చెందిన పోలయ్య కొంతకాలంగా కాగితాలపూరులోని ఓ రైతు వద్ద పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. రోజులాగానే పోలయ్య గేదెలు తీసుకుని గంగచెరువు సమీపంలో మేపుతున్నాడు. గేదెలు చెరువులోకి దిగడంతో వాటిని మందలించేందుకు చెరువులోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో ఈతరాక నీళ్లు తాగేశాడు. దీంతో చెరువులోనే పోలయ్య ప్రాణాలు వదిలాడు. స్థానిక పశువుల కాపర్లు, కూలీలు గమనించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య, ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అందరూ చిన్నపిల్లలే కావడంతో మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. భర్త మృతితో తమ కుటుంబం దిక్కులేనిదైందని భార్య పద్మమ్మ బోరున విలపించసాగింది. కేసు నమోదు  దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-03-03T04:57:44+05:30 IST