KCRకు పాలన చేతకాకే పక్క రాష్ట్రాలకు: BJP Leader ఈటెల

ABN , First Publish Date - 2022-05-21T00:06:30+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలన చేతకాక ఇతర రాష్ర్టాలలో పర్యటిస్తున్నారని బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు సరిగా రావడం లేదని, పెన్షన్లు రెండు

KCRకు పాలన చేతకాకే పక్క రాష్ట్రాలకు:  BJP Leader ఈటెల

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలన చేతకాక ఇతర రాష్ర్టాలలో పర్యటిస్తున్నారని బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు సరిగా రావడం లేదని, పెన్షన్లు రెండు మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయని,  పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేవారికి కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రం అప్పులమయం కావడంతో ఆ భారాన్ని ప్రజలమీద  మోపుతున్నారని విమర్శించారు. భూముల రిజస్ట్రేషన్ ఛార్జీలు, లిక్కర్ మీద, కరెంటు ఛార్జీలు, బస్సు ఛార్జీలు పెంచి, సంవత్సరానికి రూ. 25 వేల కోట్ల భారం ప్రజల మీద వేశారని తెలిపారు. ప్రజల డబ్బుతో ప్రత్యేక విమానాల్లో దేశంలో చక్కర్లు కొట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

Updated Date - 2022-05-21T00:06:30+05:30 IST