కేసీఆర్కు ఓటమి తప్పదు: ఈటెల
ABN , First Publish Date - 2022-06-14T02:16:17+05:30 IST
సూర్యాపేట: ఎన్నికలు ఎప్పుడొచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ను ఓడించేందుకు తెలంగాణ ప్రజానీకం ఎదురు చూస్తుందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
సూర్యాపేట: ఎన్నికలు ఎప్పుడొచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ను ఓడించేందుకు తెలంగాణ ప్రజానీకం ఎదురు చూస్తుందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. హుజూర్ నగర్లో ప్రధాని మోదీ ఎనిమిదేళ్ల ప్రజాసంక్షేమ పాలనపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. కేసీఆర్ దేశస్థాయిలో పార్టీని పెడతామని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. ఆర్టీసీ,లిక్కర్, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు పేరిట రూ.25 వేల కోట్ల భారాన్ని తెలంగాణ ప్రజలపై మోపాడని ఆరోపించారు. దళితులు, గిరిజనులు, పేదల భూములను లాక్కొని పెద్దలకు దోచిపెడుతున్నారని, ఈ లెక్క త్వరలో తెలుస్తానని హెచ్చరించారు. విశ్వనగరంగా పేరున్న హైదరాబాదులో ఆడపిల్లలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి తప్ప ఇతర మంత్రులు, ఎమ్మెల్యేకు విలువ లేదన్నారు.