నక్సలైట్లను ఎలా ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అలా చేస్తున్నారు: ఈటల
ABN , First Publish Date - 2021-08-05T23:22:26+05:30 IST
నక్సలైట్లను ఎలా ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అలా చేస్తున్నారు: ఈటల
కరీంనగర్: హుజురాబాద్ ముఖ్య కార్యకర్తలతో బీజేపీ నేత ఈటల రాజేందర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ యాక్షన్లు, డ్రామాలు చేసే వాడిని కాదన్నారు. తనతో తిరిగినా, సహకరించినా కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. నక్సలైట్లకు అన్నం పెడితే ఎలా ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అలా చేస్తున్నారని ఈటల వ్యాఖ్యానించారు. తన అనుచరులను పోలీస్ స్టేషన్కి పిలిపించి బెదిరిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారన్నారు. దళిత బంధును హుజూరాబాద్కే కాదని, రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను సీఎం కేసీఆర్ బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఈటల పేర్కొన్నారు.