‘ఈశాన్యం’ కాదు...మన మన్యం

ABN , First Publish Date - 2020-12-04T06:07:40+05:30 IST

... ఈ ఫొటోల్లో కనిపిస్తున్న ప్రాంతం ఈశాన్య రాష్ట్రాల్లోనో... ఉత్తర భారతంలోని హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ము, కశ్మీర్‌లోనో... అనుకునేరు.

‘ఈశాన్యం’ కాదు...మన మన్యం

... ఈ ఫొటోల్లో కనిపిస్తున్న ప్రాంతం ఈశాన్య రాష్ట్రాల్లోనో... ఉత్తర భారతంలోని హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ము, కశ్మీర్‌లోనో... అనుకునేరు. ఇది ప్రకృతి అందాలకు నిలయమైన మన విశాఖ ఏజెన్సీనే! సముద్ర మట్టానికి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో కొండలు, వాటిపై పరచుకున్న మేఘమాలికలు చూపరుల మదిని దోస్తున్నాయి. ఎంతసేపు చూసినా తనివి తీరని ఈ అందాలు డివిజన్‌ కేంద్రమైన పాడేరు మండలం వంజంగి పంచాయతీ పరిధిలో రోజూ తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది, తొమ్మిది గంటల వరకు ఆవిష్కృతం అవుతున్నాయి. ఈ సుందర దృశ్యాలను తిలకించడానికి మూడు రోజుల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. పర్యాటకుల రాకపోకలతో గురువారం పాడేరు నుంచి లగిశపల్లి, వంజంగి మార్గం రద్దీగా మారింది.

Updated Date - 2020-12-04T06:07:40+05:30 IST