ఈఈఈలో చర్ల విద్యార్థిని ప్రతిభ
ABN , First Publish Date - 2021-10-13T18:12:47+05:30 IST
మండలానికి చెందిన నామాల భవిష్య ఇంజనీరింగ్ (ఈఈఈ)లో అరుదైన ఘనత సాధించింది. అన్ని పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి జేఎన్టీయూ(జవహర్లాల్ నెహ్రూ) యూనివర్సిటీలో గోల్డ్మెడల్ సాధించింది. ఈ
చర్ల(భద్రాద్రి కొత్తగూడెం): మండలానికి చెందిన నామాల భవిష్య ఇంజనీరింగ్ (ఈఈఈ)లో అరుదైన ఘనత సాధించింది. అన్ని పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి జేఎన్టీయూ(జవహర్లాల్ నెహ్రూ) యూనివర్సిటీలో గోల్డ్మెడల్ సాధించింది. ఈ విషయాన్ని యూనివర్సిటీ అధికారులు బుధవారం వెల్లడించారు. మరి కొద్ది రోజుల్లో భవిష్య గోల్డ్ మెడల్ అందుకోనుంది. కాగా అత్యంత ఏజెన్సీ ప్రాతమైన చర్ల మండలంలో పుట్టి యూనివర్సిటీలో గోల్డు మెడల్ సాదించడంపై చర్ల తాహిసీల్ధార్ నాగేశ్శరావు, ఎంపీడీవో శంకర్ అభినందించారు. విద్యార్ధిని తండ్రి నామాల శ్రీనివాసరావు చర్ల మార్కెట్ కమిటీలో సెక్రటరీగా పని చేస్తున్నారు.