బీటీపీని తనిఖీ చేసిన ఈఈ

ABN , First Publish Date - 2022-08-09T05:45:01+05:30 IST

భైరవానితిప్ప ప్రాజెక్టును మైనర్‌ ఇరిగేషన ఎగ్జి క్యూటివ్‌ ఇంజనీర్‌ నారాయణనాయక్‌, డీఈ వెంకటరమణప్ప సోమ వారం తనిఖీ చేశారు.

బీటీపీని తనిఖీ చేసిన ఈఈ
మరమ్మతు పనులను పరిశీలిస్తున్న ఇరిగేషన ఈఈ తదితరులు

గుమ్మఘట్ట, ఆగస్టు 8 : భైరవానితిప్ప ప్రాజెక్టును మైనర్‌ ఇరిగేషన ఎగ్జి క్యూటివ్‌ ఇంజనీర్‌ నారాయణనాయక్‌, డీఈ వెంకటరమణప్ప సోమ వారం తనిఖీ చేశారు. ప్రాజెక్టు కుడికాలువ వద్ద ఆనకట్ట కోతకు గురై దెబ్బతినడంతో చేపడుతున్న మరమ్మత్తులను పరిశీలించారు. ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీరు చేరితే రివిట్‌మెంట్‌లు లేకపోవడంతో ఆనకట్ట కోతకు గురయ్యే ఆస్కారముందని, ముందస్తుగా ఇసుక బస్తాలతో రింగ్‌ బండ్‌ ఏర్పాటు చేసి కట్ట దెబ్బతినకుండా ప్రమాదాన్ని అరికట్టే పనులు చేపడు తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టకు ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. కర్ణాటక ప్రాంతాల్లో వారం రోజులుగా వరదనీటి ఉధృతిని గమనించి ఐదు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశామ న్నారు. ప్రస్తుతంపై భాగంలో ఇనఫ్లో తగ్గడంతో శనివారం రాత్రి ప్రాజెక్టు గేట్లను దించి ఔట్‌ ఫ్లో తగ్గించామన్నారు. వారి వెంట ఏఈ సాయిరామ్‌ ఉన్నారు.

Updated Date - 2022-08-09T05:45:01+05:30 IST