నెలాఖరులోగా 15 వేల మంది ఉపాధ్యాయుల నియామకం

ABN , First Publish Date - 2022-07-05T16:13:23+05:30 IST

నెలాఖరులోగా 15వేల మంది ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ తెలిపారు. టీచర్‌ రిక్రూట్‌మెట్‌ 2022కు

నెలాఖరులోగా 15 వేల మంది ఉపాధ్యాయుల నియామకం

                              - విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌


బెంగళూరు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): నెలాఖరులోగా 15వేల మంది ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ తెలిపారు. టీచర్‌ రిక్రూట్‌మెట్‌ 2022కు సం బంధించి జరిగిన పరీక్షా ఫలితాలను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేస్తామన్నారు. సోమవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ 15వేల మంది ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా ప్రశ్నాపత్రాల మూల్యాంకనం సాగుతోందన్నారు. మరో రెండు మూడు వారాల్లోనే పూర్తవుతుందన్నారు. అభ్యర్థులు పొందిన మార్కుల శాతాన్ని బట్టి ఎంపిక చేస్తామన్నారు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి మే నెలలో 21 నుంచి రెండు రోజులపాటు రాష్ట్రమంతటా పరీక్షలు జరిగాయన్నారు. 1,06,083 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారని వివరించారు. 

Updated Date - 2022-07-05T16:13:23+05:30 IST