విద్యాదీవెన ద్వారా రూ.67.97 కోట్లు జమ

ABN , First Publish Date - 2021-12-01T07:13:34+05:30 IST

జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా 1,12,042 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో మూడో విడత మొత్తం రూ.67.97 కోట్లు జమ చేసినట్టు జిల్లా కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు.

విద్యాదీవెన ద్వారా రూ.67.97 కోట్లు జమ
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని చెక్కును విడుదల చేస్తున్న దృశ్యం

కాకినాడ సిటీ, నవంబరు 30: జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా 1,12,042 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో మూడో విడత మొత్తం రూ.67.97 కోట్లు జమ చేసినట్టు జిల్లా కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి 2021-22 సంవత్సరానికి విద్యా దీవెన పఽథకం కింద మూడో విడత ఫీజు రియంబర్స్‌మెంట్‌ సొమ్మును తల్లుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ హరికిరణ్‌, జడ్‌పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నగర మేయర్‌ సుంకర శివప్రసన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జిల్లాలో పఽథకం వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఈ పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం లబ్ధి మొత్తానికి సంబంధించిన చెక్కును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో సీహెచ్‌.సత్తిబాబు, సాంఘిక సంక్షేమశాఖ జేడీ రంగలక్ష్మీదేవి, బీసీ సంక్షేమ శాఖ డీడీ మయూరి, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ కామేశ్వరి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.




Updated Date - 2021-12-01T07:13:34+05:30 IST