కార్పొరేటుకు దీటుగా గురుకుల కళాశాలల్లో విద్య
ABN , First Publish Date - 2022-08-08T06:37:43+05:30 IST
కార్పొరేటుకు దీటుగా గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యను అందిస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): కార్పొరేటుకు దీటుగా గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యను అందిస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కళాశాలను ఆదివారం మంత్రి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రికి కళాశాల విద్యార్థినులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కళాశాలను, తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. పాఠశాలలో మం చి ఉత్తీర్ణత శాతాన్ని సాధించిన విద్యార్థులకు మంత్రి ఈశ్వర్ ప్రశంస ప త్రాలను అందించి సత్కరించారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడారు. ప్ర భుత్వం ఒక్కొక్క విద్యార్థిపై ఏడాదికి రూ. లక్ష వరకు వెచ్చిస్తోందన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో సైతం విద్యార్థులు మంచి ఫలితాలను సా ధించాలన్నారు. అనంతరం విద్యార్థులు ఇచ్చిన పలు సాంస్కృతిక ప్రదర్శ నలను తిలకించారు. ఈకార్యక్రమంలో కలెక్టర్ గుగులోతు రవినాయక్, జ గిత్యాల, కోరుట్ల, చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, కల్వ కుంట్ల విద్యాసాగర్ రావు, సుంకె రవి శంకర్, జడ్పీ చైర్పర్సన్ దావ వసం త సురేశ్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.