యడ్లపాడులో కానరాని పర్యవేక్షణ

ABN , First Publish Date - 2020-05-30T09:23:19+05:30 IST

యడ్లపాడులో ఒకేరోజు మూడు కరోనా కేసులు వెలుగు చూడడం.. ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో అశ్రద్ధతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది

యడ్లపాడులో కానరాని పర్యవేక్షణ

యడ్లపాడు: యడ్లపాడులో ఒకేరోజు మూడు కరోనా కేసులు వెలుగు చూడడం.. ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో అశ్రద్ధతో గ్రామస్థుల్లో ఆందోళన  నెలకొంది. కరోనా కట్టడికి కృషి చేయాల్సిన పంచాయతీ అధికారి లేక పోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సచివాలయ కార్యదర్శి శ్రీనివాసరావు రెండు నెలలకు పైగా డిప్యూటేషన్‌ విధులంటూ గుంటూరు డీపీవో కార్యాలయానికే పరిమితమవడంతో స్థానికంగా పారిశుధ్య చర్యలను పర్యవేక్షించేవారు లేకుండా పోయారు. రెండు రోజుల క్రితం కంటైన్మెంట్‌ ప్రాంతాన్ని పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే రజని ఈ విషయాన్ని గుర్తించి కార్యదర్శి డిప్యూటేషన్‌ను రద్దు చేయాలని అధికారులను కోరారు.  

Updated Date - 2020-05-30T09:23:19+05:30 IST