Former Chief Minister: 36 గంటల్లో 15 హత్యలు
ABN , First Publish Date - 2022-08-25T14:51:42+05:30 IST
రాష్ట్రంలో 36 గంటల్లో 15 హత్యలు జరిగాయని, ఇదేనా శాంతిభద్రతల పర్యవేక్షణా అంటూ మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(For
- ఇదేనా శాంతి భద్రతల పర్యవేక్షణ
- ఎడప్పాడి ధ్వజం
పెరంబూర్(చెన్నై), ఆగస్టు 24: రాష్ట్రంలో 36 గంటల్లో 15 హత్యలు జరిగాయని, ఇదేనా శాంతిభద్రతల పర్యవేక్షణా అంటూ మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, ముఖ్యమంత్రి ప్రకటనల మోజులో ఉండడంతో రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయన్నారు. సీఎం ఆధీనంలో పోలీసు శాఖ ఉందనే విషయం మరువరాదన్నారు. శాంతిభద్రతలు తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సీఎం చెబుతున్నారని, అలాంటి సమయంలో 36 గంటల్లో 15 హత్యలు ఎలా జరిగాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించి ప్రజలు ప్రశాంతంగా జీవించేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉందని పళనిస్వామి పేర్కొన్నారు.