Edappadi K. Palaniswami: ఎడప్పాడి మళ్లీ సీఎం కావాలని పాదయాత్ర

ABN , First Publish Date - 2022-08-16T16:22:28+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి(Edappadi K. Palaniswami) మళఅ్ల సీఎం కావాలని ఆ పార్టీ

Edappadi K. Palaniswami: ఎడప్పాడి మళ్లీ సీఎం కావాలని పాదయాత్ర

అడయార్‌(చెన్నై), ఆగస్టు 15: మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి(Edappadi K. Palaniswami) మళఅ్ల సీఎం కావాలని ఆ పార్టీ అనుబంధ విభాగమైన ఎంజీఆర్‌ మండ్రం యువజన విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్‌ సునీల్‌ సోమవారం తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. స్థానిక టి.నగర్‌ నుంచి డాక్టర్‌ సునీల్‌(Dr. Sunil) సారథ్యంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర వచ్చే శుక్రవారానికి తిరుమల చేరుకోనుంది. ఆ తర్వాత శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆయన తన పాదయాత్రను ముగిస్తారు. ఈ యాత్ర సాగే మార్గంలో ఎడప్పాడి అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు ‘ఎడప్పాడి’ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేస్తూ పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-16T16:22:28+05:30 IST