ఏడు కోనేర్ల వద్ద ‘తీర్థవాది’
ABN , First Publish Date - 2022-05-19T03:22:18+05:30 IST
వేదగిరిపై అత్యతం వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు గురువారం పుష్పయాగం, ఏకాంతసేవలతో ముగియనున్నాయి.
నేటితో ముగియనున్న వేదగిరి బ్రహ్మోత్సవాలు
నెల్లూరురూరల్, మే 18 : వేదగిరిపై అత్యతం వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు గురువారం పుష్పయాగం, ఏకాంతసేవలతో ముగియనున్నాయి. అందులో భాగంగా బుధవారం ఏడు కోనేరుల వద్ద ఆలయ అర్చకులు తీర్థవాది కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారి కోనేరు వద్ద ఆలయ పండితులతో పాటు బయట నుంచి వచ్చిన వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలతో ఈ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం ధ్వజావరోహణ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ వేమిరెడ్డి సురేంద్రరెడ్డి, ఈవో గిరికృష్ణలు పర్యవేక్షించారు.