Mumbai మాజీ పోలీస్ కమిషనర్ Sanjay pandey కు ED సమన్లు
ABN , First Publish Date - 2022-07-04T01:14:26+05:30 IST
మనీ లాండరింగ్ కేసులో ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండేకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ..
ముంబై: మనీ లాండరింగ్ కేసులో ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే (Sanjay Pandey)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు పంపింది. ఈనెల 5వ తేదీన తమ ముందు హాజరు కావాలని శనివారంనాడు సమన్లు పంపినట్టు ఈడీ తెలిపింది. పాండే గత జూన్ 30న పదవీ విరమణ చేశారు. కాగా, ఈడీ సమన్లపై వ్యాఖ్యానించేందుకు పాండే అందుబాటులో లేరు. ఢిల్లీలోని యాంటీ మనీలాండరింగ్ ఏజెన్సీ ముందు పాండే హాజరవుతారని ఈడీ అధికారి ఒకరు చెప్పారు. అయితే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన పాండేకు ఏ మనీ లాండరింగ్ కేసులో ఈడీ సమన్లు పంపిందనేది వెల్లడించడానికి మాత్రం ఆయన నిరాకరించారు.