కోలుకున్న ఎమ్మెల్యే కరణం బలరాం
ABN , First Publish Date - 2020-08-12T11:29:34+05:30 IST
చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి బుధవారం డిశ్చార్జి కానున్నారు.
నేడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి
ఒంగోలు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి బుధవారం డిశ్చార్జి కానున్నారు. కరోనా లక్షణాలతో పది రోజుల క్రితం హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. సోమ, మంగళవారాలలో మరోసారి పరీక్షలు నిర్వహించిన వైద్యులు బలరాం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో బుధవారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. అయితే, కొన్ని రోజులపాటు బలరాం హైదరాబాద్లోనే ఉండి విశ్రాంతి తీసుకో నున్నట్లు సమాచారం.
ఇదిలాఉండగా కరోనా పాజిటివ్తో హైదరాబాద్లో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న బలరాం తనయుడు వెంకటేష్కు తాజాగా చేసిన పరీక్షలలో నెగి టివ్గా వచ్చినట్లు సమాచారం.