‘రైతు వ్యతిరేక బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలి’

ABN , First Publish Date - 2020-09-29T17:59:54+05:30 IST

దేశ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తూ రైతుల నడ్డి విరిచేలా కేంద్రం తీసుకొచ్చిన..

‘రైతు వ్యతిరేక బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలి’

కాకినాడ: దేశ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తూ రైతుల నడ్డి విరిచేలా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ రైతు వ్యతిరేక బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. డీసీసీ కార్యాలయంనుంచి కల్పన సెంటర్‌ వరకు సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ ఈ బిల్లులు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తాయన్నారు. నాయకులు బాబిబోయిన వెంకటేష్‌నాయుడు, కడియాల శ్రీనివాస్‌, తాళ్లూరి రాజు, కంభం రాజబాబు, పిట్టా అర్జున్‌, తుమ్మలపల్లి వాసు, మేడిశెట్టి నారయ్య, పిల్లి సతీష్‌, జుత్తుక సత్తిబాబు ఎస్‌కె సర్దార్‌, వల్లూరి రామ్మోహన్‌, మూర్తి, అనూష, అరుణ పాల్గొన్నారు.


Updated Date - 2020-09-29T17:59:54+05:30 IST