‘ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు’

ABN , First Publish Date - 2020-09-29T17:55:09+05:30 IST

జగపతినగరం పంచాయతీ పరిధిలోని గ్రామ శివారున ప్రభుత్వ భూమిలో ఆక్రమణదారులు..

‘ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు’

కిర్లంపూడి: జగపతినగరం పంచాయతీ పరిధిలోని గ్రామ శివారున ప్రభుత్వ భూమిలో ఆక్రమణదారులు పదిమంది షెడ్‌ నిర్మించారంటూ పెద్దాపురం ఆర్డీవోకి ఫిర్యాదు చేసినట్లు కిర్లంపూడికి చెందిన బుల్లిరాజు తెలిపారు. ఈ ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని కిర్లంపూడి తహశీల్దార్‌ సత్యనారాయణరాజును ఆదేశించారన్నారు. ఈ విషయమై ఆయన్ను వివరాలు అడగ్గా ప్రభుత్వ ఆదేశాలతో ఇళ్ల స్థలాలకోసం అక్కడ భూమి చదును చేశామని, వారికి నిర్మించే ప్లాటులో పేర్లు ఉన్నాయని, ఎన్నోఏళ్లుగా ఇక్కడే నివాసాలు ఉంటున్న బాధితులకు తాత్కాలికంగా పక్కనే ఉండేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. మాజీ సర్పంచ్‌ పెంటకోట నాగబాబు మాట్లాడుతూ బుల్లిరాజుకు, ఆ స్థలాలకు సంబంధం లేదని, అది దేవదాయశాఖ భూమి అని, ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపామని చెప్పారు.


Updated Date - 2020-09-29T17:55:09+05:30 IST