సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర నిర్వహించడానికి మంత్రులకు సిగ్గుండాలి: Harshakumar

ABN , First Publish Date - 2022-05-30T21:44:38+05:30 IST

వైసీపీ మంత్రులపై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర నిర్వహించడానికి మంత్రులకు సిగ్గుండాలి: Harshakumar

East Godavari: వైసీపీ (YCP) మంత్రులపై మాజీ ఎంపీ హర్షకుమార్ (Harshakumar) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర (Bus Yatra) నిర్వహించడానికి మంత్రులకు సిగ్గుండాలని అన్నారు. అసలు బస్సు యాత్ర చేసే అర్హత మంత్రులకు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ మూడేళ్ల పాలనలో దళితులకు చెందిన 22 పథకాలు రద్దు చేశారని ఆరోపించారు. అనంతబాబు డ్రైవర్ హత్య ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతబాబును రక్షించేందుకు పోలీసులు, ప్రభుత్వం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కోనసీమ వివాదంలో ప్రభుత్వమే ప్రథమ ముద్దాయని, అమలాపురం రణరంగంపై సీబీఐతో విచారణ జరిపించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-05-30T21:44:38+05:30 IST