సత్యదేముని సన్నిధికి పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2020-11-30T12:27:58+05:30 IST
తూర్పుగోదావరి జిల్లాలో కార్తీకపౌర్ణమి సోమవారం సందర్భంగా సత్యదేముని సన్నిధికి భక్తులు పోటెత్తారు.
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో కార్తీకపౌర్ణమి సోమవారం సందర్భంగా సత్యదేముని సన్నిధికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే సత్యదేముని వ్రతాలు, సర్వదర్శనాలు ప్రారంభమయ్యాయి. వ్రత మండపాల క్యూలైన్ల వద్ద భక్తులు బారులు తీరారు. ఆలయ అధికారులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.