AP: చేతబడి చేస్తున్నారంటూ ఇద్దరిపై హత్యాయత్నం

ABN , First Publish Date - 2022-03-14T15:06:59+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం రాంగోపాలపురంలో దారుణం జరిగింది.

AP: చేతబడి చేస్తున్నారంటూ ఇద్దరిపై హత్యాయత్నం

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం రాంగోపాలపురంలో దారుణం జరిగింది. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులపై గ్రామస్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గోపమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా... వెంకటేష్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-03-14T15:06:59+05:30 IST