AP: గోదావరి స్నానఘట్టాల్లో భక్తుల ఇబ్బందులు
ABN , First Publish Date - 2022-03-01T14:35:59+05:30 IST
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
రాజమండ్రి: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కాగా స్నానఘట్టాల్లో సరైన వసతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పుష్కరఘాట్ వద్ద దుస్తులు మార్చుకునే గదులు లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ ప్రదేశంలోనే దుస్తులు మార్చుకోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులు కనీసం స్నాన ఘట్టాల్లో తాగునీరు సదుపాయం కూడా కల్పించకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.