East godavari జిల్లా వ్యాప్తంగా వర్షాలు
ABN , First Publish Date - 2021-11-19T15:49:33+05:30 IST
వాయుగుండం ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
రాజమండ్రి: వాయుగుండం ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గత వారం కురిసిన వర్షాలకు జిల్లాలో వరి పంటకు అపార నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. అయితే అధికారుల పంటనష్టం అంచనాలు పూర్తి కాకుండానే మరోసారి వర్షంతో రైతులు కుదేలయ్యారు. రైతులు వరి కోతలు వాయిదా వేసుకోవాలని వ్యవసాయశాఖ సూచనలు జారీ చేసింది.