AP: కొండవాగు దాటుతూ ఇద్దరు గిరిజన చిన్నారులు గల్లంతు

ABN , First Publish Date - 2021-09-04T17:35:06+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కొండమోదలు పంచాయతీ బడిగుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

AP: కొండవాగు దాటుతూ ఇద్దరు గిరిజన చిన్నారులు గల్లంతు

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కొండమోదలు పంచాయతీ  బడిగుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.  కొండవాగు దాటుతుండగా ఇద్దరు గిరిజన చిన్నారులు గల్లంతయ్యారు. ఆధార్ కార్డుల పనిపై రంపచోడవరం వెళ్ళివస్తుండగా  ప్రమాదం జరిగింది. వర్షాల కారణంగా ఆకూరు - బడిగుంట  గ్రామాల మధ్య కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తమ తల్లులతో పాటు పొడియం గణేష్ దొర, వెట్టి వంశీ దొర అనే ఇద్దరు చిన్నారులు వాగు దాటుతూ  జారిపడి గల్లంతయ్యారు. 

Updated Date - 2021-09-04T17:35:06+05:30 IST