గోదావరిలో స్వల్పంగా పెరుగుతున్న వరద ప్రవాహం

ABN , First Publish Date - 2021-08-23T13:08:07+05:30 IST

తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరిలో వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది.

గోదావరిలో స్వల్పంగా పెరుగుతున్న వరద ప్రవాహం

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరిలో వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర  నీటిమట్టం 10.60 అడుగులకు పెరిగింది. దీంతో అధికారుతు ధవళేశ్వరం 175 గేట్లు స్వల్పంగా ఎత్తివేశారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 8,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అలాగే దాదాపు 3.25 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. 

Updated Date - 2021-08-23T13:08:07+05:30 IST