ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు మరిన్ని సంస్కరణలు: కేటీఆర్
ABN , First Publish Date - 2020-09-23T21:01:27+05:30 IST
రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు మరిన్ని సంస్కరణలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రమాణాల
హైదరాబాద్: రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు మరిన్ని సంస్కరణలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రమాణాల పెంపుపై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ సంస్కరణలతో రాష్ట్ర పౌరులకు సైతం అనేక ప్రయోజనాలుంటాయని తెలిపారు. సంస్కరణలతో ఆయా శాఖల పనితీరులో సానుకూల మార్పులు తెస్తామని మంత్రి పేర్కొన్నారు. పౌరులకి అన్ని సేవలను ఒకేచోట అందించేందుకు.. ప్రత్యేకంగా సిటిజన్ సర్వీసెస్ మేనేజ్మెంట్ పోర్టల్కు ప్రతిపాదనలు చేస్తామని చెప్పారు. టీఎస్ బీపాస్ అమలుపైనా సమావేశంలో చర్చించామని, చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు శాఖల మధ్య సమన్వయం అవసరమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.