లదాక్లో భూకంపం... 4.2 తీవ్రత నమోదు!
ABN , First Publish Date - 2020-10-08T17:25:44+05:30 IST
జమ్ముకశ్మీర్లోని లదాక్లో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.2 గా నమోదయ్యింది.
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని లదాక్లో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.2 గా నమోదయ్యింది. అయితే ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారమేదీ లేదు. కాగా ఇంతకుముందు రోజు మణిపూర్కు చెందిన అఖ్రూల్ జిల్లాలో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొన్న వివరాల ప్రకారం భూకంప తీవ్రగత 4.3గా నమోదయ్యింది. అలాగే మహారాష్ట్రలోని పాల్ఘర్లో కూడా 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.