జపాన్ దేశంలో భూకంపం...సునామీ ముప్పు లేదు

ABN , First Publish Date - 2021-05-14T12:45:12+05:30 IST

జపాన్ దేశంలో శుక్రవారం భూకంపం సంభవించింది....

జపాన్ దేశంలో భూకంపం...సునామీ ముప్పు లేదు

టోక్యో (జపాన్): జపాన్ దేశంలో శుక్రవారం భూకంపం సంభవించింది. జపాన్ దేశంలోని ఫుకుషిమా ప్రాంతంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైందని జపాన్ భూభౌతిక సంస్థ వెల్లడించింది. 40 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈ భూకంపం అనంతరం సునామీ ముప్పు లేదని జపాన్ శాస్త్రవేత్తలు చెప్పారు. 

Updated Date - 2021-05-14T12:45:12+05:30 IST