పాక్లో భూకంపం.. 22 మంది మృతి
ABN , First Publish Date - 2021-10-08T06:59:28+05:30 IST
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 3-3.30 గంటల మధ్య జరిగిన ..
కరాచీ, అక్టోబరు 7: పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 3-3.30 గంటల మధ్య జరిగిన ఈ దుర్ఘటనలో 22 మంది చనిపోయారు. 300 మందికిపైగా గాయపడ్డారు. భూకంప తీవ్రత ధాటికి ప్రావిన్స్లోని వివిధ ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ అధికారులు పేర్కొన్నారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. జపాన్లోనూ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.1గా నమోదైందని, సునామీ వచ్చే అవకాశం లేదని అధికారులు చెప్పారు.