అద్దంకి ప్రాంతంలో కంపించిన భూమి
ABN , First Publish Date - 2021-01-16T05:21:09+05:30 IST
అద్దంకి పట్టణ ప్రాంతంలో భూమి కంపించటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అద్దంకి, బల్లికురవ మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.20 గంటల సమ యంలో భూమి కంపించింది.
అద్దంకి, జనవరి 15: అద్దంకి పట్టణ ప్రాంతంలో భూమి కంపించటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అద్దంకి, బల్లికురవ మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.20 గంటల సమ యంలో భూమి కంపించింది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అద్దంకి ప్రాంతంలో ప్రతి ఏటా భూమి కంపిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.