20 నిముషాల్లో రూ. 20 వేలు గెలుచుకునే సదవకాశం... రండి... త్వరపడండి... ఆలసించిన ఆశాభంగం!

ABN , First Publish Date - 2021-09-30T15:19:29+05:30 IST

మీరు ఆహార ఫ్రియులా... అయితే ఈ వార్త మీకోసమే...

20 నిముషాల్లో రూ. 20 వేలు గెలుచుకునే సదవకాశం... రండి... త్వరపడండి... ఆలసించిన ఆశాభంగం!

మీరు ఆహార ఫ్రియులా... అయితే ఈ వార్త మీకోసమే... కరోనా కాలం ప్రారంభమైనప్పటి నుంచి అందరికీ ఆహారంపై దృష్టి మళ్లింది. ప్రస్తుతం కరోనా కేసులు మందగించిన నేపధ్యంలో ఫుడ్ స్టాల్స్‌కు విపరీతమైన గిరాకీ పెరిగింది. పెద్దపెద్ద మాల్స్ మొదలుకొని చిన్నిచిన్న గల్లీల వరకూ అన్నిచోట్లా లెక్కకుమించి ఫుడ్ స్టాల్స్ వెలుస్తున్నాయి. మరోవైపు జనాలు కూడా ఆహార రుచులపై అమితమైన ఆసక్తి చూపిస్తున్నారు. సాయంత్రం అయితే చాలు చాలామంది బయటకు వెళ్లి చిరుతిళ్లు తింటున్నారు. అయితే ఢిల్లీలోని ఒక ఫుడ్‌స్టాల్‌లో ఆహారం తిన్నందుకు బదులుగా డబ్బులిస్తారు. ఈ స్టాల్‌లోని అతిపెద్ద రోల్ తింటే బహుమానంగా రూ. 20 వేలు అందజేస్తారు. ఈ ఫుడ్ స్టాల్ ఢిల్లీలోని మోడల్ టౌన్-3లో రోడ్డు పక్కగా ఉంటుంది. ఈ ఫుడ్ స్టాల్‌లో 10 కిలోల కథి రోల్ (పరాఠాను గుండ్రంగా చుట్టి దానిలో వెజ్ స్టఫ్ నింపుతారు) విక్రయిస్తుంటారు. 


20 నిముషాల్లో ఎవరైనా సరే ఈ కథి రోల్ తినగలిగితే వారికి దుకాణదారు బహుమతిగా రూ. 20 వేలు అందజేస్తారు. అయితే జనం ఈ బారీ స్థాయి రోల్ చూసి షాక్ అవుతున్నారు. ఫుడ్‌స్టాల్‌లో ఈ రోల్‌ను ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తారు. ముందుగా అతిపెద్ద పరాఠాను తయారుచేసి, దాని రోల్ స్టఫ్ కోసం 30 గుడ్లను, పలురకాల వెజిటబుల్స్, పన్నీర్, సోయా చాప్ వినియోగిస్తారు. పరాఠాను వీటితో ఫిల్ చేశాక దానిలో రకరకాల సాస్‌లు పోస్తారు. ఈ కథి రోల్ పూర్తయ్యాక దీని బరువు 10 కిలోలు అవుతుంది. ఈ రోల్‌ను మూడు వేల రూపాయల నుంచి నాలుగువేల మధ్యలో విక్రయిస్తుంటారు. ఈ ఫుడ్ స్టాల్ పేరు పట్నా రోల్ సెంటర్. ఈ రోల్ ను 20 నిముషాల్లో పూర్తిగా తింటే దుకాణదారు వారికి రూ. 20 వేలు బహుమానంగా అందజేస్తారు. ఈ దుకాణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.



Updated Date - 2021-09-30T15:19:29+05:30 IST