ఎమ్మార్పీఎస్‌ నాయకుల ముందస్తు అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST

ఎమ్మార్పీఎస్‌ నాయకుల ముందస్తు అరెస్ట్‌

ఎమ్మార్పీఎస్‌ నాయకుల ముందస్తు అరెస్ట్‌
మొయినాబాద్‌ పీఎ్‌సలో అరెస్టయిన నాయకులు

కొత్తూర్‌/మొయినాబాద్‌, జూలై 1:  మోదీ హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో, ఎస్సీవర్గీకరణను తక్షణమే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ధర్నాచేపట్టిన దళిత సంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. కొత్తూర్‌ పోలీసులు ఎమ్మార్పీఎస్‌ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు పెంటనోళ్ల రవికుమార్‌ మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రధాని మోదీ సభను అడ్డుకుంటామన్నారు. అదేవిధంగా మొయినాబాద్‌లో ధర్నా చేసేందుకు సిద్ధపడిన ఆలిండియా అంబేద్కర్‌ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేగరి రాజు, ఎమ్మార్పీఎస్‌ జిల్లా కార్యదర్శి కనగల్ల సునీల్‌కుమార్‌, మండల కన్వీనర్‌ కె.మహేందర్‌, చిలుకూరు అఽధ్యక్షుడు కె.ప్రవీణ్‌, ఉప్పరి శ్రీనివా్‌సలను పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వరకు ఉంచి తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేశారు. 

Updated Date - 2022-07-01T05:30:00+05:30 IST