12 నుంచి పీజీ ఈసెట్ దరఖాస్తులు
ABN , First Publish Date - 2020-02-20T10:12:39+05:30 IST
ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి పీజీ ఈసెట్ ప్రవేశ పరీక్షకు మార్చి 12 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎలాంటి అపరాధ
- మే 28 నుంచి 31 వరకు పరీక్షలు
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి పీజీ ఈసెట్ ప్రవేశ పరీక్షకు మార్చి 12 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 4వ తేదీన జారీ చేయనున్నారు. బుధవారం జరిగిన పీజీ ఈసెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రూ.500 అపరాధ రుసుముతో మే 6 వరకు, రూ.2వేలతో మే 13 వరకు, రూ.5 వేల రుసుముతో మే 20 వరకు, రూ.10వేల అపరాధ రుసుముతో మే 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు ఫీజు కింద జనరల్, బీసీ విద్యార్థులు రూ.వెయ్యి, ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు 500 చెల్లించాల్సి ఉంటుంది. పీజీ ఈసెట్ పరీక్షను మే 28 నుంచి 31 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఫలితాలు జూన్ 15న విడుదలవుతాయి.