మా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి: ఈ - పంచాయ‌తీ ఆప‌రేట‌ర్లు

ABN , First Publish Date - 2021-10-09T19:42:52+05:30 IST

త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ఈ-పంచాయ‌తీ ఆప‌రేట‌ర్లు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు విన్నవించారు

మా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి: ఈ - పంచాయ‌తీ ఆప‌రేట‌ర్లు

హైదరాబాద్: త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ఈ-పంచాయ‌తీ ఆప‌రేట‌ర్లు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు విన్నవించారు. శనివారం హైద‌రాబాద్‌లోని మంత్రుల నివాసంలో ఆయనను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారు త‌మ స‌మ‌స్య‌ల‌తో కూడిన విజ్ఞాన‌ప‌ను అంద‌చేశారు. 


త‌మ‌కు ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని, ట్రెజ‌రీ ద్వారా వేత‌నాలు అందించాల‌ని, పిఆర్ సి ప్ర‌కారం క‌నీస వేత‌నాన్ని పెంచాల‌ని, త‌మ‌ని పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల‌కు స‌హాయ‌కులుగా ప‌రిగ‌ణించాల‌ని, హెల్త్ కార్డులు, ఇఎస్ఐ, పిఎఫ్ వ‌ర్తించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. బంగారు తెలంగాణ‌లో భాగ‌మై ప‌ని చేస్తున్న త‌మ‌కు మాన‌వ‌తా దృక్ప‌థంతో స‌హాయం చేయాల‌ని వారు మంత్రి ని కోరారు.

Updated Date - 2021-10-09T19:42:52+05:30 IST