‘ఈ-సైకిల్’... కిలోమీటరుకు పది పైసలే

ABN , First Publish Date - 2021-07-27T20:03:34+05:30 IST

పెట్రో, డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు పెరిగిపోతోన్న నేపధ్యంలో... ఇప్పుడు ‘ఈ సైకిల్’కు క్రమేపీ ఆదరణ పెరుగుతోంది.

‘ఈ-సైకిల్’... కిలోమీటరుకు పది పైసలే

ఫరీదాబాద్ : పెట్రో, డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు పెరిగిపోతోన్న నేపధ్యంలో... ఇప్పుడు ‘ఈ సైకిల్’కు క్రమేపీ ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే నహాక్ మోటార్ సంస్థ... సామాన్యుల కోసం తక్కువ బడ్జెట్‌లో ఎలక్రికల్ సైకిల్ ను రూపొందించింది. గరుడ, జిప్సీ పేరుతో రెండు మోడళ్ళల్లో ‘ఈ’ సైకిల్ ను కంపెనీ మార్కెట్‌లోకి  తీసుకువచ్చింది. దీనిని మామూలు సైకిల్ లా తొక్కుకుంటూ వెళ్ళొచ్చు.


ఎప్పుడైనాదీనిని  తొక్కలేని పరిస్ధితుల్లో బ్యాటరీ సాయంతో ఈవీ(ఎలక్ట్రిక్ వెహికిల్) గా మార్చుకోవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 40 కిలో మీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ దూరానికయ్యే ఖర్చు కేవలం 10 పైసలు మాత్రమే కావడం గమనార్హం.  ఇక ఈ ఎలక్రికల్ సైకిల్ ధర విషయానికొస్తే...  గరుడ మోడల్ ధర రూ. 31,999, కాగా జిప్సీ ధర రూ. 33,499. అంటే... ధర కాస్త ఎక్కువగానే అనిపిస్తోంది కదూ. మరి సపౌకర్యం గురించి ఆలోచిస్తే... వెసులుబాటుగానే ఉంటుందన్న వ్యాఖ్యానాలు కూడా వినవస్తున్నాయి. 

Updated Date - 2021-07-27T20:03:34+05:30 IST