ఏపీలో హిందూయీజం నశించడానికి ఇదే కారణం..

ABN , First Publish Date - 2021-02-25T18:37:38+05:30 IST

ద్వారకా తిరుమలలో నిలువు దోపిడీ జరుగుతోందని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో హిందూయీజం నశించడానికి ఇదే కారణం..

ద్వారకా తిరుమల: ఇక్కడ నిలువు దోపిడీ జరుగుతోందని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నతిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమలకు దూరప్రాంతాల నుంచి వస్తే ఇక్కడ సిబ్బంది కనీసం ప్రసాదాలు ఇవ్వడంలేదని, బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కౌంటర్ క్యూ లైన్లలో నిలుచుంటే సిబ్బంది ప్రసాదాలు లేవని చెబుతున్నారని, ఎదురుగా కనినిస్తున్నా ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ క్రిస్టియానిటీ పెరుగుతోందని, హిందూ సంప్రదాయం మంటకలిసిపోతోందన్నారు. హిందూయీజం నశించడానికి ఇదే కారణమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ క్రిస్టియన్లకు మద్దతు పెరుగుతోందని విమర్శించారు. ప్రసాదాలు బ్లాకులో కొనుక్కోమని సిబ్బంది చెప్పడం ఎక్కడ చూడలేదని భక్తులు మండిపడుతున్నారు. దేవుడి ప్రసాదంలో కూడా ఈ విధంగా వ్యవహరించడం దారుణమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-02-25T18:37:38+05:30 IST