నేటి నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులు

ABN , First Publish Date - 2020-09-25T11:07:03+05:30 IST

కొవిడ్‌-19 కారణంగా ఈ ఏడాది మార్చి 22 నుంచి నిలిచిపోయిన అంతర్రాష్ట్ర సర్వీసులను శుక్రవారం నుంచి

నేటి నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులు

ద్వారకా బస్‌స్టేషన్‌, సెప్టెంబరు 24: కొవిడ్‌-19 కారణంగా ఈ ఏడాది మార్చి 22 నుంచి నిలిచిపోయిన అంతర్రాష్ట్ర సర్వీసులను శుక్రవారం  నుంచి పునఃప్రారంభిస్తున్నట్టు ప్రజా రవాణా శాఖ (పీటీడీ) రీజనల్‌ మేనేజర్‌ ఎంవై దానం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఉదయం 4.00 గంటలకు గుణుపూర్‌, 4.30 గంటలకు నవరంగపూర్‌, 5.00 గంటలకు ఒనకఢిల్లీ, 7.00 గంటలకు పర్లాకిమిడి, మధ్యాహ్నం 1.45 గంటలకు దమన్‌జోడి, 2.30 గంటలకు జైపూర్‌, రాత్రి 8.00 గంటలకు ఇంద్రావతి బస్సులు బయలుదేరతాయని వెల్లడించారు. వీటికి సంబంధించిన టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.

Updated Date - 2020-09-25T11:07:03+05:30 IST