గోవిందా.. గోవింద..
ABN , First Publish Date - 2021-06-13T05:25:01+05:30 IST
శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
భక్తులతో కళకళలాడిన శ్రీవారి ఆలయం
ద్వారకా తిరుమల, జూన్ 12 : శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. గతంలో శని, ఆదివారం పర్వదినాల్లో భక్తుల రద్దీ అఽధికంగా ఉండేది. కొవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్డౌన్ ఏర్పాటు చేయడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు దేవాలయం తెరిచి ఉండడంతో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలించడంతో శనివారం భక్తులతో ఆలయం కళకళలాడింది. భక్తులు భౌతికదూరం పాటిస్తూ దర్శ నం చేసుకున్నారు. ఈవో సుబ్బారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.