చిన వెంకన్నకు రూ.20 లక్షల బంగారు కిరీటం
ABN , First Publish Date - 2020-10-18T16:59:47+05:30 IST
చిన వెంకన్నకు శనివారం ఓ భక్తుడు రూ. 20 లక్షల విలువై న బంగారు కిరీటాన్ని అందజేశారు. గణపవరం మండలం వల్లూరుకు..
ద్వారకాతిరుమల: చిన వెంకన్నకు శనివారం ఓ భక్తుడు రూ. 20 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని అందజేశారు. గణపవరం మండలం వల్లూరుకు చెందిన రుద్రరాజు సీతారామరాజు, సరోజిని దంపతులు 303 రాళ్లతో సహా కలిపి 435 గ్రాములు బరువు గల బంగారు కిరీటాన్ని ఈవో భ్రమరాంబకు అందజేశారు. ద్విమూర్తుల్లో పెద్ద స్వామికి కిరీటాన్ని అలంకరిం చాలని దాత కోరినట్టు అధికారులు తెలిపారు.