రోడ్లు అభివృద్ధి చేయాలి

ABN , First Publish Date - 2021-10-29T03:10:50+05:30 IST

గుంతలమయమైన రహదారులను వెంటనే అభివృద్ధిచేయాలని గురువారం స్థానిక ఆసుపత్రిరోడ్డులో ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.

రోడ్లు అభివృద్ధి చేయాలి
గుంతలమయమైన రోడ్డుపై నిరసన తెలుపుతున్న ఏఐవైఎఫ్‌ నాయకులు

గూడూరు, అక్టోబరు 28: గుంతలమయమైన రహదారులను వెంటనే అభివృద్ధిచేయాలని గురువారం స్థానిక ఆసుపత్రిరోడ్డులో ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్‌ జిల్లా నాయకుడు సునీల్‌ మాట్లాడుతూ రహదారులను పట్టించుకోక పోవడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు. పట్టణంలోని ఆసుపత్రిరోడ్డుపై పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి డివిజన్‌ పరిధిలో అధ్వానంగా ఉన్న రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో చల్లా వెంకటేశ్వర్లు, లోకేష్‌, సాయి, హసన్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T03:10:50+05:30 IST