నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వర్తించాలి

ABN , First Publish Date - 2021-05-15T06:23:49+05:30 IST

పోలీసు సిబ్బంది కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వ ర్తించాలని పోలీసు కమిషనర్‌ కార్తికేయ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్కు, అర్సపల్లి తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి మాస్కులు, సానిటైజర్‌లు, గ్లౌజ్‌లు పంపిణీ చేశారు.

నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వర్తించాలి
ట్రాఫిక్‌ సిబ్బందికి మాస్కులు పంపిణీ చేస్తున్న సీపీ కార్తికేయ

ఖిల్లా, మే 14: పోలీసు సిబ్బంది కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వ ర్తించాలని పోలీసు కమిషనర్‌ కార్తికేయ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్కు, అర్సపల్లి తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి మాస్కులు, సానిటైజర్‌లు, గ్లౌజ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది నిరంతరం విధి నిర్వహణలో ఉండాల్సి వస్తుందని, కాబట్టి అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాలని సీపీ సూచించారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నందున ప్రతిఒక్కరూ మాస్కు లు ఽధరించి అవసరం ఉన్నచోట సానిటైజర్‌ వినియోగిస్తూ విధులు నిర్వహించాలన్నారు. విధి నిర్వాహణ ఎంత ముఖ్యమో తమ కుటుంబ సభ్యులు అంతే ము ఖ్యమని తెలిపారు. జాగ్రత్తలు పాటిస్తేనే కుటుంబ సభ్యులు కూడా కొవిడ్‌బారిన పడకుండా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ అర్వింద్‌బాబు, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.

Updated Date - 2021-05-15T06:23:49+05:30 IST