జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2020-12-06T04:21:39+05:30 IST
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ ప్రభాకర్ శనివారం బాధ్యతలు చేపట్టారు.
నెల్లూరు(వైద్యం)డిసెంబరు 5 : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ ప్రభాకర్ శనివారం బాధ్యతలు చేపట్టారు. నెలరోజులుగా పూర్తిస్థాయి ఇన్చార్జి లేక ఆసుపత్రిలో అనేక సమస్యల పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో డాక్టర్ ప్రభాకర్ ఇన్చార్జి బాధ్యతలు చేపట్టటంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జీజీహెచ్లో రోగులకు అవసరమైన అన్ని సేవలూ అందిస్తామన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని తెలిపారు. ఆసుపత్రి సెల్లార్లో నీటి నిల్వలను పరిశీలించి వాటిని పంపింగ్ విధానం వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. పలువురు వైద్యులతో పాటు సీఐటీయూ అనుబంధ సంస్థ యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు సూపరింటెండెంట్ను కలిసి పుష్షగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. తమ సహకారం అందజేస్తామని తెలిపారు. సూపరింటెండెంట్ను కలిసిన వారిలో జీజీహెచ్ అధికారులు డాక్టర్ శ్రీనివాసన్, డాక్టర్ కళారాణి, డాక్టర్ నిర్మలాదేవి, డాక్టర్ మస్తాన్బాషా, యూనియన్ నేతలు నరమాల సతీష్కుమార్, షేక్ సంధానిబాషా, సురేష్బాబు, సయ్యద్ జబ్బార్, సామెల్, రామానుజులు, ఖాజామస్తాన్ పాల్గొన్నారు.