ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2021-10-07T13:34:37+05:30 IST

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకల్లో భాగంగా తొలిరోజు ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వన్‎టౌన్ వినాయకుడి గుడి వద్ద నుండి భారీగా క్యూ కట్టారు. దీంతో ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో

ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకల్లో భాగంగా తొలిరోజు ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వన్‎టౌన్ వినాయకుడి గుడి వద్ద నుండి భారీగా క్యూ కట్టారు. దీంతో ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది.అంచనాలకు మించి అతీతంగా భక్తులు వచ్చారని ఆలయ సిబ్బంది తెలిపారు. ఇరుగు పొరుగు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచి క్యూలైన్‎లో భక్తులు వేచివున్నారు. తొలి రోజున స్నాపనది కార్యక్రమాల అనంతరం 9 గంటలకు అమ్మవారి దర్శనం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - 2021-10-07T13:34:37+05:30 IST