హైకోర్టుకు 29 వరకు దసరా సెలవులు
ABN , First Publish Date - 2020-10-24T08:55:37+05:30 IST
హైకోర్టుకు శుక్రవారం నుంచి 29 వరకు దసరా సెలవులు ప్రకటించారు. 30వ
హైకోర్టుకు శుక్రవారం నుంచి 29 వరకు దసరా సెలవులు ప్రకటించారు. 30వ తేదీన ఈద్-మిలాదున్నబి కారణంగా ఆరోజు సెలవు. హైకోర్టు తిరిగి నవంబరు 2 నుంచి పని చేయనుంది.
కాగా అత్యవసర కేసుల్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ టి.రజనీ, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం 28న విచారించనుంది. ఇద్దరు న్యాయమూర్తులు విడివిడిగా కేసుల్ని విచారించనున్నారు. అదే రోజు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్రెడ్డి అత్యవసర కేసులపై విచారణ చేపట్టనున్నారు.