ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో ముగిసిన దసరా ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-10-05T21:14:34+05:30 IST

ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో దసరా ఉత్సవాలు ముగిశాయి. పదిరోజుల పాటు 10 అలంకారాల్లో దుర్గమ్మ దర్శనమిచ్చారు.

ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో ముగిసిన దసరా ఉత్సవాలు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో దసరా ఉత్సవాలు ముగిశాయి. పదిరోజుల పాటు 10 అలంకారాల్లో దుర్గమ్మ దర్శనమిచ్చారు. శ్రీరాజరాజేశ్వరీ దేవి దర్శనానికి భక్తులు  పోటెత్తారు. అమ్మవారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోందని భక్తులు తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు చండీహోమం, పూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు జమ్మిదొడ్డి నుంచి దుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకెళ్తారు. అక్కడ ఉన్న హంసవాహనంపై పూజలు చేస్తారు. వరద ఉధృతి కారణంగా నదీ విహారాన్ని రద్దు చేశారు. ఈ ఏర్పాట్లను కలెక్టర్‌ దిల్లీరావు, కమిషనర్‌ కాంతిరాణా, ఈవో భ్రమరాంబ, రివర్‌ కన్జర్వేటర్‌ కృష్ణారావు పరిశీలించారు. తెప్పోత్సవంలో వేదపండితులు, అర్చకులు, అధికారులు, ప్రజాప్రతినిధులే పాల్గొంటారు. భక్తులను అనుమతించబోరు.

Updated Date - 2022-10-05T21:14:34+05:30 IST