టీడీపీ హయాంలోనే బ్రాహ్మణులకు అభివృద్ధి ఫలాలు

ABN , First Publish Date - 2022-07-07T06:00:58+05:30 IST

టీడీపీ హయాంలోనే బ్రాహ్మ ణులు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఫలాలు అనుభవిం చారని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌(నాని) అన్నారు.

టీడీపీ హయాంలోనే బ్రాహ్మణులకు అభివృద్ధి ఫలాలు
సుబ్రహ్మణ్యేశ్వరరావు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, నెట్టెం, తదితరులు

ఎంపీ కేశినేని నాని

విస్సన్నపేట, జూలై 6: టీడీపీ హయాంలోనే బ్రాహ్మ ణులు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఫలాలు అనుభవిం చారని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌(నాని) అన్నారు.  రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన గోటేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు (బుడ్డయ్య) ప్రమాణ స్వీకారం కార్యక్రమం  విస్సన్నపేట కాకతీయ కమ్మ సేవా సమితి కల్యాణ మండపంలో జరిగింది. దీనికి హాజరైన కేశినేని నాని  మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నిధులు కేటాయించి వారి అభివృద్ధికి 100 శాతం నిధులు ఖర్చు చేశారన్నారు. బుడ్డయ్య చేసిన సామాజిక సేవలను ఎంపీ అభినందించారు. బ్రాహ్మణులందర్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి టీడీపీ విజయానికి కృషి చేయాలని సూచించారు. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, మచిలీపట్నం  మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ బ్రాహ్మణులను అధికార వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఆర్‌బీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు వేమూరి ఆనందసూర్య, రాష్ట్ర అధ్యక్షుడు కేడీఎం ప్రసాద్‌, జిల్లా అధ్యక్షుడు వెంపటి జనర్దాన్‌, పీవీ శ్రీరామ్‌మూర్తి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నెట్టం రఘురాం, లింగమనేని శివరామప్రసాద్‌, నల్లగట్ల సుధారాణి, మాజీ ఎమ్మెల్యేలు నల్లగట్ల స్వామిదాసు, శ్రీరాంతాతయ్య, శావల దేవదత్‌, నెక్కళపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-07T06:00:58+05:30 IST