దుర్గమ్మకు చామంతులు, సంపెంగల అర్చన

ABN , First Publish Date - 2021-04-21T06:12:20+05:30 IST

దుర్గమ్మకు చామంతులు, సంపెంగల అర్చన

దుర్గమ్మకు చామంతులు, సంపెంగల అర్చన

ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న వసంతోత్సవాల్లో భాగంగా 8వ రోజు మంగళవారం దుర్గమ్మను పసుపు చామంతులు, సంపెంగ పూలతో అర్చించారు. రుత్వికులు, వేదపండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణతో అమ్మవారికి పుష్పాభిషేకం నిర్వహించారు. ఘాట్‌రోడ్డులో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకులు తమలపాకు పూజ నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆంజనేయస్వామి ఆలయంలోనే సీతారాముల కల్యాణాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. - విజయవాడ, ఆంధ్రజ్యోతి

Updated Date - 2021-04-21T06:12:20+05:30 IST