శాకంబరిగా దుర్గాదేవి

ABN , First Publish Date - 2022-01-18T06:11:19+05:30 IST

పట్టణంలోని కనకదుర్గాదేవి దేవాలయంలో సోమవారం పుష్యశుధ్య పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి శాకాంబరీ ఉత్సవం నిర్వహించారు.

శాకంబరిగా దుర్గాదేవి

హుజూర్‌నగర్‌ , జనవరి 17 : పట్టణంలోని కనకదుర్గాదేవి దేవాలయంలో సోమవారం పుష్యశుధ్య పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి శాకాంబరీ ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. రెండు దశాబ్దాలుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మహిళా భక్తులు కుంకుమ పూజలు, లలితసహస్ర పారాయణం నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు నరగిరినాథుని రంగభట్టాచార్యులు, రాఘవచార్యులు, వంశీ, మోహన్‌దత్తు, కొండయ్య, గిరిబాబు, ఫణిరాంరెడ్డి, రాము, భిక్షం పాల్గొన్నారు.

Updated Date - 2022-01-18T06:11:19+05:30 IST