నేటి నుంచి దుర్గగుడిలో పవిత్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-11T07:46:42+05:30 IST

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం నుంచి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఉదయం 3 గంటల నుంచి అమ్మవారికి ప్రాతఃకాలార్చన. స్నపన కార్యక్రమం దృష్ట్యా అమ్మవారి దర్శనం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది.

నేటి నుంచి దుర్గగుడిలో పవిత్రోత్సవాలు

వన్‌టౌన్‌, ఆగస్టు 10 : దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం నుంచి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఉదయం 3 గంటల నుంచి అమ్మవారికి ప్రాతఃకాలార్చన. స్నపన కార్యక్రమం దృష్ట్యా అమ్మవారి దర్శనం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం మండపారాధన, అగ్ని ప్రతిష్ఠాపన, సర్వప్రాయశ్చిత్త విధులు నిర్వహించిన అనంతరం మూలవరులకు, ఉత్సవమూర్తులకు, ఉపాలయాలలో పవిత్ర మాలధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల సందర్భంగా పరోక్ష, ప్రత్యక్ష ఆర్జిత సేవలను రద్దుచేశారు. నిత్య కైంకర్యాలను దేవస్థాన అర్చకులు నిర్వహిస్తారు. కాగా ఆగమశాస్రం మేరకు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్న క్రమంలో బుధవారం ఆలయంలో ఉదకశాంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈవో భ్రమరాంబ, స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాదశర్మ, ప్రధాన అర్చకుడు లింగంభొట్ల దుర్గాప్రసాద్‌, వేదపండితులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T07:46:42+05:30 IST